HomeUncategorizedఎన్నికల వేళ వైసిపి రోదన

Latest Posts

ఎన్నికల వేళ వైసిపి రోదన

మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ పార్టీ కార్పొరేటర్లను కూటమి నేతలు లోబరుకుంటున్నారని, అది కుదరకపోతే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వైసిపి నేతలు వాపోతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. నయానో,భయానో అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లను లోబరుచుకుంటున్నారు. మరీ మఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఇలాంటి చర్యలు ఎక్కువయ్యాయి.

2014-2019 మధ్యన తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పనులను తెరలేపగా, తామేమి తక్కువ తినలేదంటూ 2019-2024 మధ్యన అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువే ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేసింది.

ఇలాంటి అప్రజాస్వామిక చర్యల ద్వారా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది అధికార పార్టీ ఆలోచన.

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.